ఎమ్మెల్యేగా మదన్ మోహన్ రావు ఘన విజయం

by Sridhar Babu |
ఎమ్మెల్యేగా మదన్ మోహన్ రావు ఘన విజయం
X

దిశ, లింగంపేట్ : లింగంపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాజాల సురేందర్ పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ రావు 20వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నట్లు మరోసారి ఓటర్లు రుజువు చేశారు. 2018 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన జాతర సురేందర్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. ఆయన పార్టీలో చేరిన నాటి నుండి మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ వచ్చారు.

గత నెల 30న జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఢిల్లీ నాయకత్వంతో సత్సంబంధాలు కలిగిన మదన్మోహన్​రావు ఎల్లారెడ్డి నియోజకవర్గ టికెట్ సాధించుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ప్రచారానికి రాకపోయినప్పటికీ ఒకే ఒక్కడిగా నియోజకవర్గంలోని అన్ని మండలాలు పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. మరోమారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం పట్ల ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచింది. మదన్మోహన్​రావు విజయం సాధించడం పట్ల మండల కేంద్రంలో నాయకులు నృత్యాలు చేస్తూ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లమయ్య, నారా గౌడ్, రఫీక్ గులాబ్, రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed