Mid day meals : విద్యార్థులకు కారం మెతుకులే దిక్కాయే..

by Sumithra |
Mid day meals : విద్యార్థులకు కారం మెతుకులే దిక్కాయే..
X

దిశ, కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామ పాఠశాలల్లో శుక్రవారం మధ్యాహ్నం భోజనంలో భాగంగా విద్యార్థులకు కారం పొడితో అన్నం పెట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం శుక్రవారం విద్యార్థులకు పాఠశాలలో ఎలాంటి భోజనం అందిస్తున్నారని తెసుకోవడం కోసం పాఠశాలకు వెళ్లిన గ్రామస్తులకు విద్యార్థులు కారం పొడితో భోజనాలు చేయడం కనిపించడంతో అవాక్కయ్యారు.

కారం పొడితో ఎందుకు తింటున్నారని విద్యార్థులను అడుగగా కూర సరిగా చేయలేదని, కారం పొడి వేశారని అన్నారు. విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో శనివారం పాఠశాలకు చేరుకొని మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారు. అనంతరం ఎంఈఓ నాగనాథ్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం పై దిశ ప్రతినిధి ఎంఈఓ నాగనాథ్ కు చరవాణి ద్వారా వివరణ కోరగా విద్యార్థులకు కారం పొడితో భోజనాలు పెట్టింది వాస్తవమేనని విషయం పై విచారణ చేపడుతామని ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed