- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
భర్తను హత్య చేయించింది భార్యే
దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగర శివారులోని అటవీ ప్రాంతంలో దారుణ హత్యకు గురైన యువకుడి మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువకుడిని అతని భార్యనే మరి కొంతమందితో కలిసి గొంతు కోసి హత్య చేసినట్లు తేలింది. యువకుడి హత్య కు వివాహేతర సంబంధమే కారణమని తెలిసింది. శుక్రవారం ఉదయం నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారం గండి అటవీప్రాంతంలో గుర్తు తెలియని యువకుడి హత్య వెలుగు చూసిన విషయం తెలిసిందే. యువకుడి వద్ధ ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో తొలుత గుర్తు తెలియని యువకుడి హత్య కేసుగా పరిగణించి కేసు దర్యాప్తు చేపట్టారు.
అయితే యువకుడి చేతిపై ఉన్న గాయత్రి అనే పచ్చబొట్టు ద్వారా అతడిని నిజామాబాద్ నగరవాసిగా గుర్తించారు. ఈ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అతని భార్యను విచారించగా పోలీస్ లకు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానంతో ఆమెను విచారించడంతో ఈ కేసు విచారణ కొలిక్కి వచ్చింది. మృతుడి భార్య మరి కొంతమందితో కలిసి భర్తను హత్య చేసినట్టు తేలింది. ఈ కేసులో మృతుడు మద్యం కొనుగోలు సమయంలో మరికొందరు ఉన్నారని, వారి కోసం లిక్కర్ షాప్ వద్ధ సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ కేసులో మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.