వాహన తనిఖీల్లో రూ. 30 లక్షలు స్వాధీనం

by Sridhar Babu |
వాహన తనిఖీల్లో రూ. 30 లక్షలు స్వాధీనం
X

దిశ,కార్వాన్ : వాహన తనిఖీల్లో 30 లక్షలు స్వాధీనం చేసుకున్న సంఘటన గురువారం బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివ రాలు ఇలా ఉన్నాయి. బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలెక్సా జంక్షన్ వద్ద సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్, బేగం బజార్ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. కాగా ముగ్గురు వ్యక్తులు బేగంబజార్ నుంచి సికింద్రాబాద్ వాహనంలో వెళ్తుండగా పోలీసులు వారి వాహనాన్ని ఆపి తనిఖీలు చేయగా రూ. 30 లక్షలు లభించాయి. సరైన పత్రాలు చూపించకపోవడంతో టాస్క్ ఫోర్స్ టీం నగదును స్వాధీనం చేసుకొని బేగంబజార్ పోలీసులకు అప్పగించారు.

Advertisement

Next Story