మానవత్వానికి పోతే మట్టిలో కలిశాడు...

by Sridhar Babu |
మానవత్వానికి పోతే మట్టిలో కలిశాడు...
X

దిశ,నిజాంసాగర్ : మానవత్వానికి పోతే చివరికి ప్రాణంపోయింది. ఈ దుర్ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అనగా మహమ్మద్ నగర్ మండలం గున్కుల్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. నిజాంసాగర్ ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దేవదాస్ కుమారుడు రావూరి అనిల్ (22) తన మేనమామ సాయిరాం వద్ద ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గ్రామ శివారులోని కొర అంజయ్య పొలాన్ని కేజ్ వీల్ ట్రాక్టర్ తో దమ్ము చేసి ఎత్తుగా ఉన్న ప్రాంతాన్ని (పానాది) ఎక్కించాడు.

అదే సమయంలో అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ సొంత ట్రాక్టర్ ను నడుపుతూ ఎత్తుగా ఉన్న ప్రాంతాన్ని (పానాది) ఎక్కించేందుకు ఇబ్బంది పడుతున్నాడు. అది చూసిన అనిల్ తాను ఎక్కిస్తానని చెప్పి ట్రాక్టర్ నడపడంతో అది పైకిలేవడంతో దాని కింద పడి మృతి చెందాడు. మానవత్వంతో సహాయం చేసేందుకు వెళ్లి మృతి చెందడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ తెలిపారు.

Advertisement

Next Story