శ్రీవారి కళ్యాణానికి హాజరు కానున్న సీఎం కేసీఆర్

by Sumithra |
శ్రీవారి కళ్యాణానికి హాజరు కానున్న సీఎం కేసీఆర్
X

దిశ, బీర్కూర్ : బీర్కూరు మండలం తిమ్మాపూర్ శివారులో గల తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని బీర్కూర్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు ద్రోణావళి సతీష్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు మార్చి 1 న జరిగే శ్రీవారి కల్యాణ మహోత్సవంలో పాల్గొంటారని తెలిపారు.

దేవస్థానంలో నిర్మించిన శ్రీనివాస అతిథిగృహం శ్రీవారి ఆలయంలో నిర్మించిన సముదాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. సీఎం రాక వలన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. సీఎం బ్రహ్మోహత్సవాలను హాజరుకానుండడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పెద్దఎత్తున భక్తులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story