- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్లో చేరిన బీజేపీ మాజీ నేత
దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ మాజీ నేత ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వినయ్ రెడ్డితో పాటు ఆర్మూర్ నియోజక వర్గంలోని బీజేపీకి చెందిన దాదాపు 500 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దీటుగా పోరాడేది వినయ్ రెడ్డి నని, అందుకే వినయ్ రెడ్డిని స్వయంగా తానే పార్టీలోకి ఆహ్వానించానని చెప్పారు.
అనంతరం ప్రసంగించిన వినయ్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటే పార్టీలని, సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. అందుకే బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరుతున్నట్లు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 30 వేల నుండి 40 వేల మెజారిటీ తో జీవన్ రెడ్డి ని మట్టి కరిపించి ఆర్మూర్ గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగరవేసి టీపీసీసీ కి బహుమతిగా ఇస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మాజీ శాసన సభ్యులు ఈరవత్రి అనిల్ , టీపీసీసీ అధికార ప్రతినిధి వేణు గోపాల్ యాదవ్, నిజామాబాద్ జిల్లా నాయకులు, ఆర్మూర్ ప్రాంతం నుండి వచ్చిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.