- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ప్రాణం తీసిన చేపల వేట
by Sridhar Babu |
X
దిశ, లింగంపేట్ : చేపల వేట కోసం నీటిలో దిగిన యువకుడు వల చుట్టు కోవడంతో ఊపిరాడక నీట మునిగి మృతి చెందిన సంఘటన లింగంపేట్ మండలం సురాయిపల్లి తండాలో జరిగింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సురాయిపల్లి తండాకు చెందిన రవీందర్ మంగళవారం తండా శివారులోని ఒంటరి కుంటలో చేపలు పట్టడానికి దిగాడు.
చేపల కోసం వల వేస్తున్న సమయంలో వల కాళ్లకు చుట్టు కోవడంతో నీట మునిగి ఊపిరి ఆడక చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. రవీందర్ నీట మునిగిన విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు బయటకు తీసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు.
Advertisement
Next Story