అలంపూర్ పట్టణంలో చోరీ

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-08 06:26:19.0  )
అలంపూర్ పట్టణంలో చోరీ
X

దిశ, అలంపూర్ టౌన్: అలంపూర్ పట్టణంలో భారీ చోరీ చోటు చేసుకుంది. ఇంటి ఓనర్ తెలిపిన వివరాల మేరకు మంగళవారం తెల్లవారుజామున దొంగతనం జరిగినట్టు పేర్కొన్నారు. రైతు ఆగ్రోస్ షాప్ నడుపుతున్న శాంతినగర్ ప్రాంతానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అలంపూర్ పట్టణంలో బీఆర్ఎస్ ఫంక్షన్ హాల్ ఎదురుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. సొంత పని నిమిత్తం ఊరికి వెళ్లారు. మంగళవారం ఉదయం దుకాణంలో పనిచేసే వ్యక్తి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు విరిగిపోయి కనిపించాయి. దీంతో మహేశ్వర్ రెడ్డి కి సమాచారం ఇచ్చాడు. మహేశ్వర్ రెడ్డి వచ్చి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు క్లూస్ టీమ్ సహకారంతో వివరాలు సేకరిస్తున్నారు. బాధితుడు తెలిపిన సమాచారం మేరకు లక్ష 8 వేల రూపాయల నగదు, ఒక డిస్కవరీ మోటార్ సైకిల్ ను దొంగ ఎత్తుకెళ్లాడు. దొంగ బైక్ ఎత్తుకెళ్లిన విషయాలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed