ఎగువ మానేరు ప్రాజెక్టులో జాలరి గల్లంతు..

by Sumithra |
ఎగువ మానేరు ప్రాజెక్టులో జాలరి గల్లంతు..
X

దిశ, మాచారెడ్డి : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామ శివారులోని ఎగువ మానేరు ప్రాజెక్టు వాగులో చేపల వేటకు వెళ్లిన మత్స్య కార్మికుడు గల్లంతయ్యాడు. లచ్చ పేట గ్రామానికి చెందిన కైరం కొండ శివ రాములు (55) అనే మత్స్య కార్మికుడు గల్లంతయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతని ఆచూకీ కోసం వెదుకుతున్నారు.

విషయం తెలుసుకున్న మాచారెడ్డి ఎస్ఐ అనిల్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో చేపల వేటకు వెళ్లిన శివరాములు ఉపయోగించిన తెప్ప, వల మాత్రం ఒడ్డుకు చేరింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు శివరాములు ఆచూకీ కోసం ఆందోళన కు గురై వెతికినా ప్రయోజనం కనిపించలేదు. దీంతో అధికారులకు సమాచారం అందించారు. వాగు ప్రవాహం ఉధృతంగా ఉన్నందున అంచనా వేయలేకపోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed