- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రైతుల్లో ఆందోళన వద్దు... అండగా ఉంటాం
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందొద్దని, ధైర్యంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా కల్పించారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండలం కొండూరు, పెద్ద వాల్గోట్ గ్రామాల్లో అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను, కల్లంలో తడిసిన ధాన్యాన్ని ఆయన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకుని రైతుల్లో ధైర్యం నింపారు. ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లుతున్న రైతులకు భరోసా ఇవ్వడంకోసం పంట నష్టపోయిన ప్రాంతాలకు వచ్చానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీతోనే ఉందని, ఆందోళన వద్దు అన్నారు.
అకాల వర్షాలతో నష్టపోయిన పంటలపై అధికారులు సర్వే చేస్తున్నారని, నష్టపోతే ఎకరానికి 10 వేల పరిహారం అందిస్తాం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం ఉంచండని, కాంగ్రెస్ పాలనలో రైతులకు ఇబ్బందులు ఉండవు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం నిరంతరం రైతుల పక్షానే నిలబడుతుందన్నారు. ఉచిత కరెంటు, రైతు భరోసా, పంటల బీమా పథకం, రైతు నేస్తం లాంటి పథకాలతో రైతుల్లో భరోసా నింపుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 4,295 కోట్ల రూపాయలను రైతుభరోసా ( రైతుబంధు) పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని, 4 ఎకరాలకు పైన ఉన్న రైతులకు వారం రోజుల్లో నగదు బదిలీ చేస్తామని వెల్లడించారు. పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఆయన వెంట తాహెర్ బిన్ హందాన్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే , బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, పలువురు రైతులు పాల్గొన్నారు.