ట్రస్మా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

by Sridhar Babu |
ట్రస్మా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
X

దిశ, బోధన్ : తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) నూతన కార్యవర్గాన్ని శుక్రవారం చందూర్ లోని శ్రీ సాయి విద్యాలయం లో జరిగిన డిస్ట్రిక్ జనరల్ బాడీ మీటింగ్ లో ఎన్నుకున్నారు. మామిడాల్ మోహన్, కాంతి గంగారెడ్డి లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించగా మాక్లూర్ మండలానికి చెందిన రాస నిత్యానందం ను జిల్లా అధ్యక్షులుగా, నందిపేట్ కు చెందిన అరుణ్ కుమార్ ను జనరల్ సెక్రెటరీ గా, చందూర్ కు చెందిన ఉప్పాల మధు ను ట్రెజరర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు శ్రీనివాస్ రావు (నవీపేట్), గోపి కృష్ణ (ఆర్ముర్), చైతన్య (నిజామాబాద్), నబి (డిచ్పల్లి), ప్రసాద్ రావు (భీంగల్), నగేష్ (వర్ని)లను ఉపాధ్యక్షులుగా,

వేణు గోపాల్, రాజు రెడ్డి, కళ్యాణ్, హరీష్, చిరంజీవి లను జాయింట్ సెక్రటరీ లుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర స్పోక్ పర్సన్ జయ సింహ గౌడ్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ కి శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామీణ ప్రాంత బడ్జెట్ స్కూల్ సమస్యల పై పోరాటాలు చేయాలని , అలాగే సంఘ అభివృద్ధి కి ఎల్లవేళలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్లు నర్సింగ్ రావు, ధర్మ రాజు, రమణా రావు, గోవర్ధన్, జిల్లాలోని అన్ని మండలాల ట్రస్మా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story