క్యాన్సర్​ను ప్రారంభ దశలోనే గుర్తించాలి

by Sridhar Babu |
క్యాన్సర్​ను ప్రారంభ దశలోనే గుర్తించాలి
X

దిశ, నిజామాబాద్ సిటీ : క్యాన్సర్​ను ప్రారంభ దశలోనే గుర్తించాలని జిల్లా జడ్జి కె. సునీత, జిల్లా న్యాయ సేవాధికారి (డీఎస్ఎల్ఏ ) పద్మావతి అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిజామాబాదులో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథులుగా వారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముందుగా మహిళా వైద్యులందరికీ జాతీయ మహిళా వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవాలని, కాలానుగుణంగా క్రమం తప్పకుండా అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అడగ్గానే జిల్లా కోర్టు మహిళా ఉద్యోగులకు, జిల్లా ఫారెస్ట్ మహిళా ఉద్యోగులకు ఇక్కడ స్కానింగ్ పరీక్షలు ఏర్పాటు చేసినందుకు

డా. ప్రతిమ రాజ్ కి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ మాట్లాడుతూ ప్రపంచంలో అతి వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి ఈ క్యాన్సర్ అన్నారు. ప్రతి 6 మరణాలలో 1 క్యాన్సర్ మరణం ఉంటుందని, ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సగానికి పైగా క్యాన్సర్ మరణాలు ఉంటాయని మేధావులు అంచనా వేస్తున్నారని తెలిపారు. స్త్రీలలో గర్భాశయ, బ్రెస్ట్ క్యాన్సర్లను గుర్తించడానికి తగిన పరీక్షలను చేయించుకోవాలని సూచించారు. అలాగే పురుషులలో పొగాకు వలన ఎక్కువ సంభవిస్తుందని, అందుకే ధూమపాన నిషేధంతో క్యాన్సర్​ను నివారించాలని తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డా. సరస్వతి, డా. పూర్ణిమ , డా. అనుపమ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed