ఆర్మూర్ లో తాళం వేసిన ఇళ్లల్లో చోరీ

by Sridhar Babu |
ఆర్మూర్ లో తాళం వేసిన ఇళ్లల్లో చోరీ
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో మంగళవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. సంక్రాంతిని పురస్కరించుకొని సొంత ఊర్లకు, బంధువుల వద్దకు వెళ్లిన వారి ఇండ్లను టార్గెట్ చేసి దొంగలు దోచుకున్నారు. మంగళవారం రాత్రి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలోని ఆదర్శనగర్ లో ఓ ఇంట్లో, తిరుమల కాలనీలోని శ్మశాన వాటిక దగ్గర గల మరో ఇంట్లో రెండు పోర్షన్లలో కలిపి మొత్తం తాళం వేసిన మూడు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. మామిడిపల్లి వెంకటేశ్వర కాలనీలో ఆదర్శనగర్ లో తాళం

వేసిన ధర్పల్లి జోష్ణ శ్రీధర్ ఇంట్లో రెండు తులాల బంగారం, రెండున్నర లక్షల నగదుతో పాటు సీసీ కెమెరాల డీవీఆర్ ను, ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులను ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలాన్ని ఆర్మూర్ పోలీసులు పరిశీలించి క్లూస్ టీంను రప్పించారు. అదేవిధంగా ఆర్మూర్ మున్సిపల్ లోని తిరుమల కాలనీకి చెందిన శ్మశాన వాటిక పక్కన గల ఇంటి ఓనర్ ప్రవీణ్, కిరాయి దారుడికి చెందిన ఇంట్లో తాళాలను పగలగొట్టి చోరీలకు పాల్పడ్డారు. ఓ ఇంట్లో లాప్టాప్, 14 తులాల బంగారం, 9 వేల నగదు, మరో ఇంట్లో బంగారం, వెండి ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వాపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆర్మూర్ పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed