తాళం వేసిన ఇంట్లో చోరీ

by Sridhar Babu |
తాళం వేసిన ఇంట్లో చోరీ
X

దిశ, జక్రాన్ పల్లి : మండలంలోని సికింద్రాపూర్ గ్రామానికి చెందిన అప్పల లక్ష్మి అనే మహిళ తాళం వేసిన ఇంట్లో నుండి బంగారు నగలను ఎత్తుకెళ్లారు. ఎస్సై తిరుపతి తెలిపిన కథనం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు తన ఇంటికి తాళం వేసి జలాల్పూర్ లోని ఆమె తల్లిగారింటికి వెళ్లింది. సోమవారం సాయంత్రం నాలుగు

గంటలకు ఫోన్ చేసి ఆమె ఇంట్లో దొంగతనం జరిగిందని తెలుపగా వెంటనే వచ్చి చూసే సరికి గుర్తుతెలియని దొంగలు ఇంటి తాళం పగలగొట్టి బంగారం, నగలను దొంగలించుకుని పారిపోయారు. అప్పల లక్ష్మీ ఫిర్యాదు పై కేసు నమోదు చేసుకొని సంఘటన స్థలానికి క్లూస్ టీం రప్పించి వేలిముద్రలు సేకరించినట్లు, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed