- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
మల్లారం అటవీ ప్రాంతంలో యువకుడి దారుణ హత్య
దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ రూరల్ మండలం అటవీ ప్రాంతంలో యువకుడు హత్యకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో అటవీ ప్రాంతంలో యువకుడిని గొంతు కోసి హత్య చేశారని కొందరు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ వెంకట్ నారాయణ, రూరల్ ఎస్ హెచ్ ఓ మహేష్ లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువకుడి చేతిపై గాయత్రి అనే పచ్చబొట్టు ఉండడంతో యువకుడి ఆచూకీ కోసం పోలీసులు అన్ని
పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసులను పరిశోధించారు. పచ్చబొట్టు ఆధారంగా నగరంలోని 5వ టౌన్ పరిధిలో గల ఇంద్రాపూర్ వాసి సయ్యాజి (35) గా కుటుంబ సభ్యులు గుర్తించారు. గురువారం స్నేహితులతో కలిసి విందు కోసం వెళ్లిన సయ్యాజి హత్యకు గురి కావడం వెనుక వివాహేతర సంబంధం కారణమై ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్కడ విందుకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. అదే విధంగా సయ్యాజి ఉపయోగించిన సెల్ ఫోన్ ఆచూకీ తెలిస్తే కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.