నిజామాబాద్ నగరంలో దారుణ హత్య

by Mahesh |
నిజామాబాద్ నగరంలో దారుణ హత్య
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో ఓ వ్యక్తి దారుణ హత్య గురయ్యాడు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని ఆరవ టౌన్ పరిధిలోని ధర్మపురి హిల్స్ ప్రాంతంలోని రంజానీ బాబా దర్గా ప్రాంతంలో హాసన్ (50 ) సంవత్సరాలు వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశారు. కత్తులతో పొడిచి, గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దారుణ ఘటన సోమవారం రాత్రి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేష్, స్థానిక పోలీసులు సందర్శించారు. దర్గా నిర్వహణ విషయంలో విషయంలో వచ్చే డబ్బుల పంచాయతీ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. హసన్ అక్కడ దర్గా బాగోగులు తీసుకోవడంతో పాటు, ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగితే తాయెత్తులు కట్టేవాడని తెలిసింది. డబ్బుల విషయంలో గొడవలు జరిగి హత్య జరిగినట్లు స్థానికులు తెలిపారు.

Next Story

Most Viewed