జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను: కేటీఆర్

by Mahesh |
జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను: కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: గురువారం తెల్లవారుజామున జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన తన ట్వీట్‌లో "జర్నలిస్టు చిలుక ప్రవీణ్ పై విచక్షణారహితంగా కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇదేమి రాజ్యం? ఇదేమి దౌర్జన్యం? ప్రజాపాలన అంటే ప్రశ్నించే వారిపై దాడులు చేయడమేనా?, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భౌతిక దాడులకు తెగబడుతారా?ప్రజల గొంతుకగా, ముఖ్యంగా దళిత బహుజన వర్గాల సమస్యల పైన ప్రభుత్వాన్ని నిలదీస్తున్న జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ దాడి చేసిన గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని" కేటీఆర్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. కాగా ఉదయం పలువురి దాడిలో గాయపడిన ప్రవీణ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Next Story