కుప్పకూలిన వేదిక... కాంగ్రెస్ నాయకురాలికి తీవ్ర గాయాలు

by M.Rajitha |
కుప్పకూలిన వేదిక... కాంగ్రెస్ నాయకురాలికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్ : షాపింగ్ మాల్ నూతన ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా వెళ్లిన పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అనుమాండ్ల ఝాన్సీ రెడ్డికి ప్రమాదం చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సినీనటి ప్రియాంక మోహన్ మరియు పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా కాసం షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదికపై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో, ఎక్కువ మంది వేదికపై ఎక్కడంతో వేదిక ఒకేసారి కుప్పకూలింది. వేదిక పై ఉన్న పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డికి కాలు విరిగినట్లు... రాజకీయ వర్గీయుల సమాచారం. వెంటనే ఝాన్సీ రెడ్డిని హైదరాబాద్ ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేసేటప్పుడు ముఖ్యఅతిథిగా పిలిచిన అతిధిలను జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత ఆ షాపింగ్ మాల్ నిర్వాహకుల దేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విధంగా ప్రారంభోత్సవానికి పిలిచి అవమానపరచడం సరికాదని, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొమ్మిది రోజులు జరుపుకోవాలని బతుకమ్మ సంబరాల్లో పాల్గొనవలసిన ఝాన్సీ రెడ్డి ఈ విధంగా కాలు విరిగి విశ్రాంతి తీసుకోవడం చాలా బాధాకరమని కాంగ్రెస్ పార్టీ వర్గీయులు చర్చించుకుంటున్నారు.

Next Story