సోన్ బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని బాలిక మృతదేహం లభ్యం

by Sridhar Babu |
సోన్ బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని బాలిక మృతదేహం లభ్యం
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని మండల పరిధిలోని సోన్ బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని 15 సంవత్సరాల బాలిక మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఆ గుర్తు తెలియని బాలికను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి గొనె సంచిలో చుట్టి గోదావరి నదిలో పడవేసి ఉన్నట్లు స్థానికులు చెప్పారు. సంఘటనా స్థలాన్ని ఆర్మూర్ ఏసీపీ జగదీష్ చందర్, భీమ్గల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు గోపి, శ్రీనివాస్ యాదవ్ లు పరిశీలించి వివరాలు సేకరించారు. మృతి చెందిన బాలిక ఎవరనే దానిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story

Most Viewed