తల్లీకుమారుడు మిస్సింగ్.. కీలక ప్రకటన విడుదల చేసిన పోలీసులు

by Bhoopathi Nagaiah |
తల్లీకుమారుడు మిస్సింగ్.. కీలక ప్రకటన విడుదల చేసిన పోలీసులు
X

దిశ, చేగుంట : తల్లీకుమారుడు అదృశ్యమైన సంఘటన నార్సింగి మండల పరిధిలోని షేర్ పల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. నార్సింగి ఎస్సై మహమ్మద్ మోహినుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. షేర్‌పల్లి గ్రామానికి చెందిన చెప్పాల జ్యోతి, ఆమె కుమారుడు సాత్విక్ ఈనెల 12వ తేదీ నుంచి కనిపించడం లేదని తెలిపారు. ఈనెల 12వ తేదీన కుటుంబంలో జరిగిన గొడవ కారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో జ్యోతి పసుపు కలర్ చీర, ఎరుపు కలర్ జాకెట్ ధరించి ఉందని, చామన ఛాయ రంగులో ఉంటుందని చెప్పారు. సాత్విక్ ఎరుపు కలర్ షర్టు, బ్లూ కలర్ చెడ్డీ ధరించి ఉన్నాడన్నారు. జ్యోతి భర్త చెప్పాల బాబు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అహ్మద్ మోహినొద్దీన్ తెలిపారు.

Next Story

Most Viewed