ఆర్మూర్లో బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి గెలుపు

by Sridhar Babu |
ఆర్మూర్లో బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి గెలుపు
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పైడి రాకేష్ రెడ్డి ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయఢంకా మోగించారు. నియోజకవర్గంలో పోటీ చేసిన మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు బీఆర్ఎస్ (జీవన్ రెడ్డి) కి 39,051 ఓట్లు, బీజేపీ (రాకేష్ రెడ్డి)కి 71,651 ఓట్లు రాగా, కాంగ్రెస్ (వినయ్ రెడ్డి)కి 42,349 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి 29,302 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ఆర్మూర్ అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ ప్రకటించి, పైడి రాకేష్ రెడ్డికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలో తొలిసారిగా కమల వికాసంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed