బీఆర్ఎస్ కు బిగ్ షాక్

by Sridhar Babu |
బీఆర్ఎస్ కు బిగ్ షాక్
X

దిశ, భిక్కనూరు : ముందు నుంచి ఊహిస్తున్నట్లుగానే... ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆత్మ కమిటీ చైర్మన్, భిక్కనూరు మండల బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు పెద్ద బచ్చ గారి నర్సింహారెడ్డి, భిక్కనూరు సొసైటీ చైర్మన్ గంగల భూమయ్య, జంగంపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్, జిల్లా సర్పంచ్ ల ఫోరం కన్వీనర్ మాడుగుల నర్సింలు యాదవ్ లతోపాటు పలువురు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్​లోని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ నివాసంలో జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరారు.

వారందరికీ కండువాలు మెడలో వేసి షబ్బీర్ అలీ పార్టీలోకి ఆహ్వానించారు. వారితోపాటు మాజీ జెడ్పీటీసీ సభ్యులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంద రమేష్, జంగంపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యురాలు పుల్లూరి బాల్ నర్సవ్వ, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీ లను సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి నేతృతంలోని తమ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందన్నారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ స్థానాలను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అనంతరం పార్టీలో చేరిన వారు షబ్బీర్ అలీని శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి బద్ధం ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఎంపీపీ అధ్యక్షులు జాంగారి గాల్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపరి భీంరెడ్డి, కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ జిల్లా కన్వీనర్ చిట్టెడి సుధాకర్ రెడ్డి, కన్వీనర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బల్యాల సుదర్శన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అందె దయాకర్ రెడ్డి, దేవరాజ్ గౌడ్, అంకం రాజు, పెద్ద బచ్చగారి మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story