పార్టీకి మళ్లీ పూర్వ వైభవం…అన్ని రకాలుగా అండగా నిలబడతాం

by Kalyani |
పార్టీకి మళ్లీ పూర్వ వైభవం…అన్ని రకాలుగా అండగా నిలబడతాం
X

దిశ, భిక్కనూరు : ధైర్యంగా ఉండాలని... పార్టీకి మళ్లీ తప్పక పూర్వ వైభవం వస్తుందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం రాత్రి ఎర్రవెల్లి ఫాం హౌస్ లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం ఎంపీటీసీ సభ్యులు, సొసైటీ చైర్మన్లు మర్యాదపూర్వకంగా కలిశారు. మండల పరిషత్ ప్రత్యేక సమావేశాన్ని బహిష్కరించి ఇక్కడికి వచ్చామని చెప్పారు. మమ్మల్ని సంప్రదించకుండా సమావేశాన్ని ఏర్పాటు చేశారని, పైగా ఆ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ ను ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆహ్వానించడాన్ని నిరసిస్తూ, ప్రత్యేక మండల సమావేశాన్ని బహిష్కరించడం జరిగిందని ఎంపీటీసీలు వివరించగా వెరీ గుడ్ అంటూ సీఎం కేసీఆర్ ప్రశంసించారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన మీకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామని భరోసానిచ్చారు.

పార్టీ నుంచి పెద్ద నాయకులు మరో పార్టీకి వెళ్లిపోయినప్పటికీ, ధైర్యం సాహసం చేసి సమావేశాన్ని బహిష్కరించడం పట్ల వారికి మాజీ సీఎం కేసీఆర్ అభినందనలు తెలియజేశారు. అంతకుముందు అదే ఫామ్ హౌస్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఎంపీటీసీలు భేటీ ఐ స్థానిక రాజకీయాలపై కూలంకశంగా చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గుడిసె యాదగిరి, ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ దాయారి సాయి రెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అత్తెలి శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ నాగర్తి భూంరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు అందె మహేందర్ రెడ్డి, కాసాల బాల గౌడ్, సరస్వతి ప్రభాకర్, అందే ప్రేమలత, సరస్వతి సువర్ణ, లక్ష్మీ బాలగౌడ్, కోడూరి సాయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed