అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ ను కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి..

by Sumithra |
అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ ను కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి..
X

దిశ, ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గురువారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తిరుమల తిరుపతి వెంకటేశ్వర దర్శనం కోసం ఇచ్చే ఎమ్మెల్యే సిఫార్సుల లేఖలను పరిగణలోకి తీసుకునే విధంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తో చర్చించాలని కోరారు.

అలాగే నియోజకవర్గాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, అధికార పార్టీకి మాత్రమే ప్రోటోకాల్ పాటిస్తున్నారని ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో కచ్చితంగా ప్రోటోకాల్ పాటించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కోరారు.

Next Story

Most Viewed