AP News:నేడు ఇడుపులపాయకు వైఎస్ షర్మిల..కారణం ఏంటంటే?

by Jakkula Mamatha |
AP News:నేడు ఇడుపులపాయకు వైఎస్ షర్మిల..కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు(ఆదివారం) కడప జిల్లా ఇడుపులపాయకు రానున్నారు. ఈ రోజు రాత్రికి ఇడుపులపాయ గెస్ట్ హౌస్‌లో ఆమె బస చేయనున్నారు. రేపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఉదయం 7.30 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం విజయవాడకు పయనమవుతారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన ఆమె వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సభకు సీఎం, మంత్రులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం రోజున ఏపీలో పర్యటించనున్నారు. జులై 8వ తేదీన విజయవాడకు వెళ్లనున్న ఆయన వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సభకు హాజరు కానున్నారు.

Advertisement

Next Story

Most Viewed