మాజీ మంత్రి సీఆర్ఆర్ కు నేతల నివాళులు..

by Sumithra |
మాజీ మంత్రి సీఆర్ఆర్ కు నేతల నివాళులు..
X

దిశ, ఆదిలాబాద్ : పార్టీలకు అతీతంగా అభిమానం పొందిన నాయకుడు మాజీ మంత్రి సి. రామచంద్రారెడ్డికి ఆదిలాబాద్ జిల్లా నేతలు పార్టీలకతీతంగా పూలమాలలు వేసే నివాళులర్పించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని చిలుకూరి లక్ష్మీ గార్డెన్ లో నిర్వహించిన మాజీ మంత్రి రామచంద్ర రెడ్డి ప్రథమ వర్ధంతికి అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారు. ఆదిలాబాద్ ఎంపీ జి.నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ లతో కాంగ్రెస్ తెలుగుదేశం, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు వచ్చి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ మాజీ మంత్రి రామచంద్ర రెడ్డికి ఎంతో గుర్తింపు ఉందని అన్నారు. మాయ మకుటం లేని రాజకీయ నాయకుడిగా ప్రజల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు గండ్రత్ సుజాత, అల్లూరి సంజీవరెడ్డి, అంబకంటి అశోక్, బీజేపీ, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు మాజీ మంత్రి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యోగక్షేమాలను ఎంపీ, ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed