Attendant Attack : మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదిన అటెండర్

by Kalyani |
Attendant Attack : మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదిన అటెండర్
X

దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులను అదే పాఠశాలలో పనిచేసే అటెండర్ భోజన విట్టల్ 26వ రోజున మద్యం సేవించి మద్యం మత్తులో తరగతుల మధ్య సమయంలో విద్యార్థులు బయటకు రాగా వారిని బెదిరించి చితకబాదినట్లు విద్యార్థులు తెలిపారు. విద్యార్థులకు గాయాలు కాగా విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అనంతరం విద్యార్థులకు కలిగిన గాయాలపై విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపారు.

Next Story