కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఆశిష్ సంగ్వాన్…

by Kalyani |
కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఆశిష్ సంగ్వాన్…
X

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బదిలీ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన కలెక్టర్ గా నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ను ప్రభుత్వం నియమించింది. నిజామాబాద్ నగర కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్న జితేష్ వి పాటిల్ నూతన జిల్లాకు మూడో కలెక్టర్ గా వచ్చారు. మూడేళ్లకు పైగా జిల్లాలో విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం కలెక్టర్ బదిలీ కావడంతో ఆయనకు పలువురు అధికారులు వీడ్కోలు పలికేందుకు క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు.

అధికారుల్లో గుబులు…

ప్రస్తుత కలెక్టర్ బదిలీపై వెళ్లిన ఆయన స్థానంలో కొత్త కలెక్టర్ రావడంతో నూతన కలెక్టర్ గురించి తెలుసుకోవడంలో అధికారులు బిజీ అయ్యారు. నిర్మల్ జిల్లాలో తెలిసిన అధికారులకు ఫోన్ చేసి కలెక్టర్ ఎలా ఉంటారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. విధుల విషయంలో కొత్త కలెక్టర్ ముక్కుసూటిగా ఉంటారన్న ప్రచారం కొనసాగుతుండటంతో అధికారుల్లో గుబులు మొదలైందని తెలుస్తుంది.

Next Story

Most Viewed