- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఏటీఎం ధ్వంసం చేసి నగదు చోరీకి యత్నించిన యువకుడి అరెస్టు
by Sridhar Babu |
X
దిశ, నిజామాబాద్ క్రైం : నగరంలోని గోశాల రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి నగదు దొంగిలించేందుకు యత్నించిన మిర్చికంపౌండ్ కు చెందిన పడమటి రమేష్ ను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఇంచార్జి ఏసీపీ విజయసారథి తెలిపారు. ఈ నెల 16న గోశాల రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎంను రమేష్ ధ్వంసం చేయగా అలారం మోగడంతో పారిపోయాడు.
అక్కడ దొరికిన సీసీటీవీ పుటేజీ ఆధారంగా రమేష్ ను బుధవారం అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు. మద్యానికి బానిసై జల్సాలకు అలవాటుపడ్డ పడమటి రమేష్ గత ఏడాది డిసెంబర్ 18న అర్సపల్లి ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి నగదు దొంగిలించేందుకు యత్నించి అలారం మోగడంతో పారిపోయాడని ఏసీపీ తెలిపారు. అతన్ని పకడ్బందీ సమాచారంతో నిజామాబాద్ నగర సీఐ నరహరి, 3వ టౌన్ ఎస్సై ప్రవీణ్ పట్టుకున్నారని ఏసీపీ తెలిపారు.
Advertisement
Next Story