బీజేపీ జాతీయ సదస్సులో ఆర్మూర్ ఎమ్మెల్యే

by Sridhar Babu |
బీజేపీ జాతీయ సదస్సులో ఆర్మూర్ ఎమ్మెల్యే
X

దిశ, ఆర్మూర్ : దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న బీజేపీ జాతీయ సదస్సుకు బీజేపీ రాష్ట్ర ముఖ్య నాయకులతో కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. ఈ జాతీయ బీజేపీ సదస్సులో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన మెలకువలు,కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, ప్రతి ఇంటికి చేర వేయాలో వివరించినట్లు దిశ తో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చెప్పారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హ్యాట్రిక్ ప్రధానిగా గెలిపించాలని బీజేపీ నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేస్తూ ఉండాలని పార్టీ జాతీయ నాయకులు ఈ సదస్సులో వివరించినట్లు పైడి రాకేష్ రెడ్డి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed