- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకొని వచ్చే లోగా బైక్ మాయం
దిశ, భిక్కనూరు : ఏటీఎం ముందు పార్క్ చేసి ఉంచి లోపలికి వెళ్లి డబ్బులు డ్రా చేసుకొని బయటకు వచ్చేసరికి ద్విచక్ర వాహనం చోరీ అయిన సంఘటన శుక్రవారం భిక్కనూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలోని అంతపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పున్న గంగయ్య మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ సమీపంలో ఉన్న ఎస్ బీ ఐ ఏటీఎం వద్దకు బైక్ పై వచ్చాడు. బైక్కు కీ ఉంచి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకొని బయటకు వచ్చేసరికి ద్విచక్ర వాహనం కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికాడు.
వాహనం ఆచూకీ దొరకకపోవడంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి బైక్ అపహరించుకుపోయారని ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఏటీఎం వద్దకు చేరుకొని సీసీ కెమెరాలను పరిశీలించారు. వాహనాన్ని అపహరించుకుపోయిన వ్యక్తి తనతో పాటు ఏటీఎంలోకి వచ్చి డబ్బుల కోసం ప్రయత్నించాడని, కార్డు పెట్టి డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పటికీ డ్రా కాలేదని తెలిపారు. బైక్కు తాళం చెవి ఉంచడంతో పట్టపగలు బైక్ చోరీ చేసినట్టు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని స్థానిక పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.