- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
విద్యార్థినులను పరామర్శించిన అదనపు కలెక్టర్..
దిశ, నిజామాబాద్ ప్రతినిధి : నిజామాబాద్ నగర శివారులోని దాస్ నగర్ వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ పరామర్శించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులు ఈశ్వరి (11), గౌతమి (13) లను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈశ్వరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలుపగా, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని బాధిత కుటుంబీకులకు అడిషనల్ కలెక్టర్ ధైర్యం చెప్పారు. అంతకు ముందు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి, రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం అదనపు కలెక్టర్ సంఘటన స్థలాన్ని సైతం సందర్శించి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాద ఘటన పై సమగ్ర విచారణ జరపాలని పోలీసు అధికారులకు సూచించారు.