ద్విచక్రవాహనం ఢీ కొట్టడంతో యువకుడు మృతి

by Sridhar Babu |
ద్విచక్రవాహనం ఢీ కొట్టడంతో యువకుడు మృతి
X

దిశ, ఏర్గట్ల : ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన దండవోయిన సతీష్ తన స్నేహితులతో కలిసి శనివారం రాత్రి అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన గుర్రపు అజయ్ అజాగ్రత్తగా ద్విచక్ర వాహనం నడుపుతూ సతీష్ ని ఢీ కొట్టడం తో తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే తన స్నేహితులు హుటా హుటిన మెట్పల్లి హాస్పిటల్ కి తీసుకెళ్లగా డాక్టర్ పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సతీష్ తండ్రి ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ మశ్చేందర్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story