నీటి కాలువలో పడి వ్యక్తి మృతి

by Sridhar Babu |
నీటి కాలువలో పడి వ్యక్తి మృతి
X

దిశ, భీంగల్ : మోర్తాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పిట్ల మల్లేష్ (35) శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తు నీటి కాలువలో పడి మృతి చెందాడు. ఎస్సై అనిల్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మల్లేష్ తన బైక్ పై పాలెం వైపు వెళ్తూ అజాగ్రత్తగా నడపడంతో రోడ్డు పక్కనే గల నీటి కాలువలో పడిపోయాడు. పాలెం సబ్ స్టేషన్ మూలమలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో మల్లేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story