భార్య, బామ్మర్ది వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య

by Sridhar Babu |
భార్య, బామ్మర్ది వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో భార్య, బామ్మర్ది వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. నాలుగో టౌన్ ఎస్ఐ సంజీవ్ తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ కి చెందిన రాథోడ్ రమేష్ అనే వ్యక్తి 10 సంవత్సరాల క్రితం నిజామాబాద్​ రోటరీ నగర్ కి చెందిన భార్గవి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకోగా వారికి ఇద్దరు పిల్లలు సంతానం కలరు. ఇటీవల రమేష్ భార్య భార్గవి, ఆమె అన్న బాల కృష్ణ,

ఆమె తల్లిదండ్రులు కలిసి రమేష్ మానసికంగా బాధ పడేలా అతనితో నువ్వు బతకడం ఎందుకు, అప్పులు ఎందుకు చేస్తున్నావ్, నువ్వు చనిపో అని సూటిపోటి మాటలతో వేధించేవారు. ఇటీవల బాలకృష్ణ ఇంట్లో జరిగిన ఫంక్షన్ లో రమేష్ ని కొట్టాడు. దాంతో వారి మాటలను, మానసిక బాధను భరించలేక గురువారం ఉదయం 3 గంటల ప్రాంతంలో ఇంట్లో ఫ్యాన్ కి చీరతో ఉరి వేసుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న రమేష్ ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు. తన తమ్ముని చావుకి కారణమైన భార్గవి, బాలకృష్ణ, వారి తల్లిదండ్రులపై చర్యకు రమేష్ సోదరుడు రవి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed