మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు అస్వస్థత..

by Vinod kumar |
మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు అస్వస్థత..
X

దిశ, నిజాంసాగర్: మోడల్ స్కూల్‌లో 7 గురు విద్యార్థులకు అస్వస్థత గురైన ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట పరిధిలో చోటు చేసుకుంది. సాయంత్రం 5 గంటలకు స్నాక్స్ సమయంలో వేయించిన పెసర పప్పు ఇచ్చారు. దీంతో సుమారు 7 గురు విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన ట్రాలీ ఆటోలో మండల కేంద్రంలో గల ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అస్వస్థతకు గురైన విద్యార్థులు శ్వాస సంబంధిత ఇబ్బందులకు గురవుతున్నారని మెరుగైన చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


అస్వస్థతకు గురైన విద్యార్థులు శిరీష అన్నారం ఇంటర్ సెకండ్ ఇయర్, జీ. నందిని అల్లపూర్ సెకండ్ ఇయర్, నీలిమ అల్లపూర్ సెకండ్ ఇయర్, సావిత్రి అల్లపూర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, స్నేహాలత, బ్రాహ్మణ పల్లీ, సెకండ్ ఇయర్, డీ. నందిని మార్డి, ఉన్నట్లు ANM విజయ తెలిపారు.

Advertisement

Next Story