గంజాయి మత్తులో రెచ్చిపోయిన యువకులు.. కాపాడే ప్రయత్నం చేసిన వారిపై దాడి

by Anjali |
గంజాయి మత్తులో రెచ్చిపోయిన యువకులు.. కాపాడే ప్రయత్నం చేసిన వారిపై దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. తాజాగా గంజాయి మత్తులో నలుగురు యువకులు వీరంగం సృష్టించారు. స్థానిక అంజలి స్కూల్ సమీపంలో ఓ యువకుడిపై గంజాయి బ్యాచ్ దాడి చేసింది. నడి రోడ్డుపై భాదితుడి బట్టలిప్పి పోకిరీలు చావబాదారు. అందరూ చూస్తుండగానే గంజాయి మత్తులో వాళ్లని వారే మరిచి ఆ యువకుడ్ని ఇష్టమొచ్చినట్లు చితకబాదారు. చుట్టు పక్కల వారు కాపాడే ప్రయత్నం చేస్తుంటే వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. గతకొంతకాలంగా సూర్యాపేటలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతున్న సూర్యాపేట పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఈ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. గతంలో గంజాయి మత్తులో హత్యలకు పాల్పడ్డ ఘటనలు కూడా ఉన్నాయి. ఇక గంజాయి, డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటామని చెప్పిన విషయం తెలిసిందే. డ్రగ్స్ తీసుకొవద్దని టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి యువత కోసం ఓ అవగాహన వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏపీ ప్రభుత్వం కూడా గంజాయి, డ్రగ్స్ నిర్మూలించే ఆలోచనలో ఉంది. పిల్ల భవిష్యత్తును కాపాడాటానికి డ్రగ్స్, గంజాయి మాఫియా అంతం చేస్తామని హోంమంత్రి అనిత ఇటీవలే చెప్పుకొచ్చింది.



Next Story

Most Viewed