MLA Battula Lakshmareddy : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి

by Kalyani |
MLA Battula Lakshmareddy : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి
X

దిశ, మిర్యాలగూడ టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో భాగంగా పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్ కు రూ.కోటి రూపాయలు మంజూరు కావడంతో శుక్రవారం పాఠశాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి లక్ష్యంగా కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా మౌలిక వసతులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మంజూరైన కోటి రూపాయలతో లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed