శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపటి నుంచి జనవరి దర్శన టికెట్లు విడుదల

by Jakkula Mamatha |
శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపటి నుంచి జనవరి దర్శన టికెట్లు విడుదల
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. శ్రీవారి దర్శనానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. ఈ క్రమంలో తిరుమల వెళ్లడానికి ముందస్తు ప్రణాళికతో ఉన్న భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. వివరాల్లోకి వెళితే.. రేపటి నుంచి జనవరి దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో జనవరి నెలకు సంబంధించిన దర్శనం టికెట్లను టీటీడీ పాలక మండలి విడుదల చేయనుంది.

Advertisement

Next Story

Most Viewed