పశువులకు గడ్డి కోస్తుండగా... విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి

by Kalyani |
పశువులకు గడ్డి కోస్తుండగా... విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి
X

దిశ, బొంరాస్ పేట్ : - పశువులకు గడ్డి కోస్తుండగా.. విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి చెందిన ఘటన దుద్యాల మండలంలోని రోటిబండా తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన పాత్లావత్ పాండ్యా నాయక్ (61) గురువారం సాయంత్రం పొలంలో పశువుల మేత కోసం గడ్డి కోస్తుండగా…విద్యుత్ తీగలు తాకడం వల్ల విద్యుత్ షాక్ గురై పాండ్యానాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు.మృతునికి భార్య సోనీ బాయి, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబంలో, తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed