సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కీలక సమావేశం

by Y.Nagarani |   ( Updated:2024-10-18 05:42:58.0  )
సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కీలక సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఎన్టీఆర్ భవన్ లో కీలక సమావేశం జరగనుంది. టీడీపీ ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఎన్డీయే ప్రభుత్వ విజయాలు, సభ్యత్వ నమోదు సహా 8 అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే టీడీపీ సభ్యత్వ నమోదు, పంచాయతీ రాజ్ వ్యవస్థ, పల్లె పండుగ, సూపర్ సిక్స్ పాలసీలపై సీఎం చంద్రబాబు నాయుడు సమావేశంలో చర్చించనున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఎంపీలను అడిగి తెలుసుకోనున్నారు.

సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతమో లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పల్లా శ్రీనివాస్ తెలిపారు. రూ.100 తీసుకునే సభ్యత్వ నమోదు కార్యక్రమంతో రూ.5 లక్షల బీమా కల్పించే యోచన చేస్తున్నామని, దీనిపైన అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed