అర్హులందరికీ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే

by Naveena |
అర్హులందరికీ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే
X

దిశ, వేములపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో.. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం వేములపల్లి మండల కేంద్రంలో ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసిందన్నారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు పనిచేస్తుందని సూచించారు. రైతుబంధు ఆలస్యమైన సంఘటన దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అంతకు ముందు మండలంలోని సల్కనూర్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో.. నిర్మించిన గోదామును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ గడ్డం స్ఫూద్రర్ రెడ్డి, జడ రాములు యాదవ్, ఎంపీడీవో శారద, తహసిల్దార్ సాదత్, నాయకులు శంకర్ నాయక్, చిరుమర్రి కృష్ణయ్య, తమ్మడబోయిన అర్జున్, రావు ఎల్లారెడ్డి, పుట్టల కృపయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story