Trending: ఓ వైపు ఎమ్మెల్యేకు క్షీరాభిషేకం.. మరోవైపు మునుగోడు వీధుల్లో తాగుబోతుల మద్యాభిషేకం

by Shiva |
Trending: ఓ వైపు ఎమ్మెల్యేకు క్షీరాభిషేకం.. మరోవైపు మునుగోడు వీధుల్లో తాగుబోతుల మద్యాభిషేకం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరినా బెల్టు షాపుల దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతోంది. మునుగోడు నుంచి కాంగ్రెస్ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో ఆయన ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన నియోజకవర్గ పరిధిలో బెల్ట్ షాపులు ఉండకూడదంటూ అందరికీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు మద్యం అమ్ముతున్న బెల్ట్ షాపుల బెల్టు తీయండంటూ పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. వరుసగా పోలీసుల దాడులతో కొన్ని రోజుల పాటు బెల్ట్ వ్యవహారం సద్దుమణిగింది. అనంతరం నియోజవర్గ ప్రజలు బెల్ట్ షాపులను మూసివేయించినందుకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి క్షీరాభిషేకాలు చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇన్నాళ్లు సైలెంట్ ఉన్న బెల్ట్ షాపుల నిర్వహకులు మళ్లీ బెల్ట్ దందాను మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే గురువారం మునుగోడు నియోజకవర్గం కేంద్రంలో మందుబాబులు హల్‌చల్ సృష్టించారు. ఏకంగా వీధుల్లో తప్పతాగి, రోడ్డుపై వెళ్లే వారిని దుర్భాషలాడుతూ వీరంగం వేశారు. అయితే, స్థానికుల సమాచారం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తాగుబోతులను పైకి లేపేందుకు ప్రయత్నించగా కనీసం నిలబడేందుకు వారిలో ఓపిక లేకపోవడం చూసి పోలీసు కానిస్టేబుల్ సహా పలువురు ముక్కున వేలేసుకున్నారు.

వీడియో లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://x.com/TeluguScribe/status/1811617874202755199



Next Story