ఇదేందయ్యా ఇది..ట్రాక్టర్‌ బ్యాటరీలు చోరీ

by Naveena |
ఇదేందయ్యా ఇది..ట్రాక్టర్‌ బ్యాటరీలు చోరీ
X

దిశ, చిలుకూరు: మండలంలోని పోలేనిగూడెంలో ట్రాక్టర్ల బ్యాటరీలు చోరీ జరిగింది. రైతు మండవ నాగార్జున, ఎలుగూరి సత్యనారాయణకు చెందిన ట్రాక్టర్ల బ్యాటరీలను గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి చోరీ చేశారు. అలాగే సీతారాం తండాలో 8 మంది రైతుల ట్రాక్టర్ బ్యాటరీలను చోరీకి గురయ్యాయి. దీంతో బాధిత రైతులు ఫిర్యాదు చేయగా..పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 'దిశ'కు అందిన సమాచారం ప్రకారం మునగాల మండలం బరాఖత్ గూడెంలో 3, కృష్ణానగర్ లో 10 బ్యాటరీలు చోరీ జరిగాయి. ఒక్కో బ్యాటరీ విలువ రూ.10 వేలు ఉంటుందని బాధిత రైతులు తెలిపారు. వ్యవసాయ పనుల అనంతరం ఇంట్లో ఉంచిన ట్రాక్టర్ల బ్యాటరీలు చోరీకి గురయ్యాయన్నారు. తమకు న్యాయం చేయాలని రైతులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed