పంచాయతీ రాజ్ అధికారులతో ఎమ్మెల్యే రివ్యూ మీటింగ్

by Naveena |
పంచాయతీ రాజ్ అధికారులతో ఎమ్మెల్యే రివ్యూ మీటింగ్
X

దిశ, జుక్కల్:-ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. జుక్కల్ నియోజకర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు,పెండింగ్ వర్క్స్ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు స్వీకరించారు. లబ్దిదారులకు సీఎం సహాయ నిధి (CMRF )చెక్కులు పంపిణీ చేశారు.

Advertisement

Next Story