కొద్దిపాటి వర్షానికే చిత్తడిగా మారుతున్న రహదారి

by Naveena |
కొద్దిపాటి వర్షానికే చిత్తడిగా మారుతున్న రహదారి
X

దిశ, డిండి : మండలంలో నగరదుబ్బ తండా నుంచి తవక్లాపూర్ వెళ్లే రహదారి కొద్దిపాటి వర్షానికే చిత్తడిగా మారుతుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతురని లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్ చక్రవర్తి తెలిపారు. ఈ రహదారి గుండా ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు ప్రమాదానికి గురవుతున్నాయని వాపోయారు. రహదారి మధ్యలో గుంత ఏర్పడిందన్నారు. ఈ రహదారి గుండా ప్రయాణం అంటేనే ప్రయాణికులు భయపడుతున్నారని తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed