మానవత్వాన్ని చాటుకున్న ట్రాక్టర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు..

by Aamani |
మానవత్వాన్ని చాటుకున్న ట్రాక్టర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు..
X

దిశ,సూర్యాపేట టౌన్ : సూర్యాపేట పట్టణానికి చెందిన చేపూరి పరిపూర్ణ చారి (51) మరణం మాకు తీరని లోటని సూర్యాపేట ట్రాక్టర్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రాందేని ఆదినారాయణ అన్నారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని 32 వ వార్డు లోని మృతుని నివాసం వద్ద ఆర్థిక సాయం అందజేసిన అనంతరం అధ్యక్షుడు రాందేని ఆదినారాయణ మాట్లాడుతూ.. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన చేపూరి పరిపూర్ణాచారిది నిరుపేద కుటుంబం కావడంతో ఆ కుటుంబానికి సూర్యాపేట ట్రాక్టర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు, మెకానిక్ లు అందరూ కలిసి రూ. లక్ష అరవై వేల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు. మెకానిక్ లు అంతా ఐక్యంగా ఉండి అసోసియేషన్ సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అసోసియేషన్ లో ఎవరికైనా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు తోటి మెకానిక్ లు తోచినంత సహాయం చేసి ఆర్థికంగా బాధిత కుటుంబానికి అండగా నిలబడి సమాజంలో ఆదర్శంగా ఉండాలన్నారు. అసోసియేషన్ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, మెకానిక్ లు అనే తేడా లేకుండా అందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉండాలన్నారు.అనంతరం పరిపూర్ణ చారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ట్రాక్టర్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రాందేని ఆదినారాయణ,ఉపాధ్యక్షుడు అక్బర్, ప్రధాన కార్యదర్శి పల్స మహేష్, కోశాధికారి అనిల్, గౌరవ సలహాదారులు యూసుఫ్, రాయపాటి శ్రీను, కుంచారపు నాగిరెడ్డి, బంధనాదం రాజు, మృతుని కుటుంబ సభ్యులు ప్రమీల, ప్రసన్న, సాయి బ్రహ్మచారి,మరియు ట్రాక్టర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, తోటి ట్రాక్టర్ మెకానిక్ లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed