108 అంబులెన్సులో గర్భిణీకి ప్రసవం.. తల్లీ బిడ్డా క్షేమం

by Vinod kumar |
108 అంబులెన్సులో గర్భిణీకి ప్రసవం.. తల్లీ బిడ్డా క్షేమం
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్: అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. జిల్లాలోని అడ్డగూడూరు మండలం గోవిందపురం గ్రామానికి చెందిన బుర్రు అమృత అనే గర్భిణీకి ఉదయం నొప్పులు రాగా.. మోత్కూర్‌లోని గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించారు.

అక్కడ నార్మల్ డెలివరీ కష్టం కావటంతో వైద్యులు 108 వాహనంలో భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. కాగా, మార్గమధ్యలో రాయగిరి గ్రామం వద్దకు చేరుకోగానే పండంటి పాపకి అంబులెన్స్‌లో జన్మనిచ్చింది. అనంతరం 108 వాహన సిబ్బంది తల్లి, శిశువును భువనగిరి జిల్లా కేంద్ర హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందించారు. తల్లి బిడ్డా క్షేమంగా ఉన్నట్లు జిల్లా కేంద్ర ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు.108 సిబ్బంది ఇఎంటి ఎస్ భాస్కర్, పైలట్ సోమేశ్వర్‌ని కుటుంబ సభ్యులు, జిల్లా కేంద్ర ఆస్పత్రి వైద్యులు ప్రశంసించారు.

Advertisement

Next Story

Most Viewed