మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

by Naveena |
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
X

దిశ, కనగల్లు: కనగల్లు మండల పరిధిలోని తొరగల్లు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన సిరిపోలు కరుణాకర్ అనారోగ్యంతో మృతి చెందారు. విషయాన్ని తెలుసుకున్న గ్రామ మాజీ సర్పంచ్ చీరబోయిన మాధవి యాదయ్య ,రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా..మృతుడి కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కనగల్లు గ్రామానికి చెందిన ప్రసాద్, వీరయ్య, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed